39.2 C
Hyderabad
April 23, 2024 17: 13 PM
Slider వరంగల్

పస్రా హత్య ఘటనలో రెండో వ్యక్తి పరిస్థితి విషమం

devendar reddy

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లోని పస్రా లోని బెంగళూరు బేకరీ వద్ద జరిగిన ఘర్షణలో వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయిన సంఘటన తెలిసిందే. అతనితో బాటు కత్తిపోట్లకు గురైన దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దేవేందర్ రెడ్డిని 108 లో ఎంజీఎంకు తరలిస్తున్న క్రమంలోనే మరణించినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఈ విషయం ధృవీకరణ కాలేదు.

ఇప్పుడు దేవేందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఒక బేకరీ ముందు సునీల్ రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అతనితో పాటు దేవేందర్ రెడ్డిని కూడా నరికారు. స్నేహితులకు రావాల్సిన డబ్బులు కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి బేకరీకి వచ్చిన కొద్దిసేపటి కే సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్ధిక కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Related posts

ఉప్పల్‌లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: నేర్ధం భాస్కర్‌గౌడ్‌

Satyam NEWS

సాక్షి భావనారాయణ స్వామి భూములు ఇవ్వద్దు

Satyam NEWS

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పురస్కారం

Satyam NEWS

Leave a Comment