32.2 C
Hyderabad
April 20, 2024 21: 24 PM
Slider కడప

పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించాలి

జనసేన పార్టీ కడప నియోజకవర్గం నేతలు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి భద్రత కల్పించాలంటూ కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నందు మహా నిరసన తెలిపారు.జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై 250 కోట్ల సుపారితో హత్య జరపడానికి కుట్రపన్నారని కేంద్ర నిఘా వర్గాలు తెలపడంతో కడప నగరంలోని అంబేద్కర్ కూడలి నందు జనసైనికులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రజాదారణ పొందుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ని అంతమొందించడానికి కుట్ర పనుతునరాని దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని నిందితులను పట్టుకుని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కి భద్రత విషయమై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరగా Z+ క్యాటగిరి భద్రతను కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రి ని అంతమొందిస్తే వాళ్లకు సులువుతుందని

కుట్రకు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారిని త్వరగా తేల్చి వారిని అరెస్ట్ చేయాలని తెలిపారు. కడప జిల్లాలోని ఆగస్టు 20 న సిద్ధవటం బహిరంగ సభలో కూడా కుట్ర జరిగిందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల విభాగం) కే.సురేష్ బాబు. కడప నగర అధికార ప్రతినిధి పత్తి విశ్వనాధ్ జనసేన జిల్లా నాయకులు పండ్ర రంజిత్ కుమార్, బోరెడ్డి నాగేంద్ర, నాగరాజు, వీర మహిళా కుప్పల జ్యోతి, కిరణ్, చార్లెస్, రంగా జనసైనికులు పాల్గొన్నారు.

Related posts

గృహ సారథులను, కన్వీనర్లను రద్దు చేయాలి

Satyam NEWS

మహిళ క్రికెట్ కోచ్ గా సర్టిఫికెట్ సాధించిన లాస్య

Bhavani

అధికార పార్టీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా

Satyam NEWS

Leave a Comment