Slider ప్రత్యేకం

శారదా పీఠం స్వామికి జగన్ ఇచ్చిన వరం: రద్దు చేసిన బాబు ప్రభుత్వం

#saradapeetham

జగన్ రెడ్డి పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో ఈ ఒక్క ఉదాహరణ చెబితే చాలు. రాష్ట్రంలో ప్రాధాన్యతలు ఏవీ తెలియని జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన కులం వాళ్లకు దోచి పెట్టడమే కాకుండా తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న వారికి ప్రభుత్వ ఖర్చు తో భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలా జగన్ రెడ్డి ప్రాధాన్యతలో వచ్చిన వ్యక్తి విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర సరస్వతి. స్వరూపా నంద స్వామి భద్రతకు నెలకురూ.20 లక్షల ప్రభుత్వ ధనం ఖర్చు చేశారు.

రాష్ట్రంలో పేరున్న, ఆదరణ ఉన్న స్వాములకు లేని భద్రత ఈయనకు ఎందుకు? అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆధ్యాత్మిక స్వామిగా గాక రాజకీయ స్వామిగా, పైరవీల స్వామిగా పేరుగాంచిన చినముషిడివాడ శారదాపీఠం స్వరూపానందకు వైసీపీ ప్రభుత్వం కల్పించిన  కేటగిరీ స్థాయి భద్రత ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తొలగిపోనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థాన గురువుగా పేరుపడిన స్వరూపానంద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఆయన అక్రమాలు అన్యాయాలపై విచారణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం అందులో భాగం గా ముందుగా భద్రతను తొలగించనుంది. నలుగురు గన్ మెన్లు,ఆరుగురు సిబ్బందితో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ ను అక్కడ నుంచి తీసేస్తున్నారు. రాజు తలచుకొంటే.. అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో ఎచ్చులకు పోయి నలుగురు గన్మెన్లు, ఆరుగురు సిబ్బందితో స్వరూపానంద పెందుర్తి పీఠం వద్ద పికెట్ పెట్టించుకొన్నారు.  

24 గంటలూ వీరు ఇక్కడ కాపలాకా చేయాల్సిందే. ఒక ఎస్ ఐ ఈ పికెట్ కు ఇన్చార్జిగా వుండి పర్యవేక్షిస్తారు. దీనికి అదనంగా ప్రోటోకాల్ కారు (బుగ్గకారు) వుంటుంది. వీటన్నింటికీ నెలకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 18 నుంచి 24 లక్షల రూపాయలు మాత్రమే….

Related posts

విజయనగరం టూటౌన్ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ దీపికా…!

Satyam NEWS

దొంగను పట్టుకున్న చండూర్ సిఐ సురేష్ కుమార్

Satyam NEWS

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!