ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీ ప్రెస్ పిష్ మార్కెట్ ను డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిదిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్య పరిశ్రమ అభివృద్ధి పదంలో బాగంగా చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందన్నారు. మరిన్ని సీ ఫ్రెష్ బ్రాంచీలు ఏర్పాటు చేసి వినియోగదారుల మన్నలను పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కోకొండ జగన్, అల్లిబిల్లి మహేందర్,మాస శేఖర్, బానాల నారాయణ రెడ్డి, రామానుజన్, బింగి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, పుష్ప రాజ్, శ్యామ్, సంస్థ యాజమాన్యం రాకేష్ కుమార్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.