బిచ్కుంద మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిడే జీలుగ విత్తనాల పంపిణీ ప్రక్రియను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగు విత్తనాలు అవసరమయ్యే రైతులు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రాలతో రావాలని కోరారు. ప్రభుత్వ ధర 30kg బస్తాకు 567రూపాయలు ఉంటుందన్నారు. అవసరమైన రైతులు జీలుగు విత్తనాలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, ఎంపిపి అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, సర్పంచ్ శ్రీరేఖ రాజు, సిఇఒ శ్రావణ్ కుమార్ వైస్ చైర్మన్ యాదవ్ రావు, వ్యవసాయ అధికారి పోచయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు సహకార సంఘ పాలకవర్గ సభ్యులు రైతులు పాల్గొన్నారు.
previous post
next post