28.2 C
Hyderabad
April 20, 2024 11: 44 AM
Slider నిజామాబాద్

స్వీయ నిర్బంధంలో ఉండిపోయిన గ్రామాలు

villeges

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని అన్ని గ్రామాలు లాక్ డౌన్ సందర్భంగా  స్వీయ నిర్బంధం లో ఉన్నాయి. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా స్థానిక సర్పంచ్, యువకులు కర్రలు, ముళ్ళపొదలతో ప్రధాన దారులను నిర్బంధం చేశారు. కోటగిరి మండల కేంద్రం లో పలు గల్లీలలోకి ఎవరూ రాకుండా కర్రలు అడ్డంగా కట్టారు.

ఆ కర్రలకు మా గల్లీలలోకి ఎవరూ రావొద్దు కరోనా తేవద్దు అనే ప్లకార్డులు ఏర్పాటు చేశారు.పోలీసు బలగాల కొరత కారణంగా పోతంగల్ గ్రామంలో యువకులు, టీచర్లు ముందుకు వచ్చి గ్రామంలో కి ఎవరూ రాకుండా కాపలా కాశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్ని శంకర్,హన్మాండ్లు కల్లూరి, డాక్టర్ రమేష్, సూదం గంగరాజు,నాగయ్య సార్ టీచర్,సున్నం రాజు పాల్గొన్నారు.

Related posts

ట్రోల్స్: వెనుక నుండి పట్టవద్దు ముందు నుండి దొరకవద్దు

Satyam NEWS

విస్తృతంగా రాజంపేట లో బత్యాల ప్రజా చైతన్య యాత్ర

Satyam NEWS

ప్రాక్టికల్స్ తర్వాత ప్రీఫైనల్స్

Sub Editor 2

Leave a Comment