Slider ఖమ్మం

కరోనాను అడ్డుకోవడానికి స్వీయ నియంత్రణే శరణ్యం

#MalluBhattiVikramarka

వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేవలం స్వీయ నియంత్రణే శరణ్యమని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా స్థానిక మధిర ప్రభుత్వ ఆసుపత్రి లో ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం పట్టణంలోని మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధిర పట్టణం పరిసర ప్రాంతాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుందని ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా స్వీయ  నియంత్రణ పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రంగా హనుమంతరావు పట్టణ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా దా రా బాలరాజు సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు  కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

సంస్కరణల‌ స్రష్ట

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!