ఏపీలోని విజయనగరం జిల్లా ఇక నుంచీ విద్యల నగరంతో పాటు హరిత నగరం అని అంటున్నారు. జిల్లా కలెక్టర్ నగరంలోని వీటీ అగ్రహారం సమీపంలోని ఏపీఐఐసీ వద్ద జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అటు అటవీశాఖ, ఇటు పరిశ్రమల శాఖ సంయుక్తంగా దాదాపు వందమొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడాలని అందుకు తనవంతు సహకారాన్నిఅందిస్తానని కలెక్టర్ అన్నారు. తొలుత కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ శర్మ, పరిశ్రమల శాఖ మేనేజర్ సుధాకర్ లు స్వాగతం పలికారు. మొత్తం నాటిన మొక్కల పెంపకానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ల పంపిణీ సదుపాయం కల్పించారు.
previous post