ప్రకాశం జిల్లా కందుకూరులో సెల్ఫీ మోజులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బొద్ది కూరపాడు గ్రామానికి మణికంఠ గత రెండు సంవత్సరాలుగా కందుకూరులో లస్సిడే షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రాత్రి సుమారు 9:30 సమయంలో పాములు పట్టే వ్యక్తి పాముని తీసుకుని షాప్ దగ్గరికి రాగా మణికంఠ సెల్ఫీ మోజులో నాగుపామును మెడలో వేసుకున్నాడు.
పాము యువకుడిని కాటు వేయడంతో స్థానికులు వెంటనే కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్క తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.