నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సీనియర్ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సోమిశెట్టి బాలీశ్వరయ్య సోమవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత మరణించారు. విషయం తెలుసుకున్న వెంటనే బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాదులు కురుమూర్తి, శ్రీహరి, గోవింద్, మనోహర్, రాఘవేంద్ర ఆయన నివాసానికి చేరుకున్నారు. అదే విధంగా ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. మధ్యాహ్నం వారి భౌతిక ఖాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కల్పించారు. బాలీశ్వరయ్య మృతి పట్ల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధను వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల తరబడి న్యాయపరంగా పోరాటం చేసిన ఒక గొప్ప సీనియర్ న్యాయవాది ని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ ధైర్యంగా ఉండాలన్నారు. సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటించారు.
జూపల్లి ముఖ్య అనుచరులు మేకల నాగరాజు, సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, కౌన్సిలర్ రహీం,మేకల కిరణ్ యాదవ్, రమేష్ ముదిరాజ్, కేతూరి ధర్మ తేజా, దిలీప్, సందీప్ బాలీశ్వరయ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. ఆయన న్యాయవ్యవస్థలలో న్యాయవాదిగా ఎన్నో సేవలు అందించారని వారిని కొనియాడారు. బాలీశ్వరయ్య అకాల మరణం వారి కుటుంబానికే కాదు ఆర్యవైశ్య సంఘానికి తీరని లోటని, సంఘం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని,అంతేకాకుండా వాసవి కళ్యాణ మండప ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని ఆ సంఘ సభ్యులు అంటున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అంటున్నారు.
బాలీశ్వరయ అకాల మరణం నాన్నెంతో చింతిచిందని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ చింతలపల్లి జగదీశ్వర్ రావు అన్నారు. అలాంటి న్యాయవాదిని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.ఆయన అనుచరులు పులమాలలు వేసి నివాళలర్పించారు.
బాలీశ్వరయ మృతి పట్ల కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు రంగినేని అభిలాష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి అకాల మరణం దురదృష్టకరమన్నారు. ఆయన న్యాయవ్యవస్థలో ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచి వారికి న్యాయం చేశారన్నారు. ఇలాంటి గొప్ప న్యాయవాదిని కోల్పోవడం బాధాకరం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు. వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, నాయకులు బాలీశ్వరయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.