సీనియర్ పాత్రికేయుడు ఈదా రాంబాబు (56) కరోనాతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రభూమి, వార్త దినపత్రిక లలో సుదీర్ఘ కాలం సేవలందించిన రాంబాబు ప్రతి ఒక్కరిని అన్నా అంటూ ఆప్యాయతతో పలకరించే స్నేహ శీలి, వివాదరహితుడు.
ఈదా రాంబాబు మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని జర్నలిస్టు సంఘాలు తెలిపాయి. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడుకి వివాహమైంది.
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్ గా విశాఖపట్నంలో ఉన్నారు. కుమార్తె ఫిజియోథెరపిస్ట్, మరో కుమారుడు డేవిడ్ దినకరన్ అహ్మదాబాద్ ఐఐఎం లో ఉద్యోగం చేస్తున్నారు. క్రిస్మస్ కి వచ్చి అప్పటి నుండి ఇక్కడే ఉన్నారు.