భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బొడ్డు అంజయ్య అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావిడియా రాములు నాయక్ బేతాళపాడులోని అంజయ్య స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడు అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు నిస్వార్ధంగా అంజయ్య కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు రాందాస్, ఎంపీపీ లావిడియా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వేల్పుల నరసింహారావు, మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్, రోకటి సురేష్, నర్వనేని పుల్లారావు, రామిశెట్టి రాంబాబు, మాజీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మల్లెల నాగేశ్వరరావు, లేళ్ల గోపాల్ రెడ్డి, మోదుగు రామకృష్ణ, పనితి వెంకటేశ్వర్లు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరితోపాటు పలు పార్టీకి చెందిన పలువురు నాయకులు అంజయ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు.