కరోనాతో మరణించిన వారికి ఎక్కడా కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగడం లేదు. మృతదేహన్ని చూడడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రావడంలేదు. అందరు ఉన్నా అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు తమ సేవలు అందించేందు ముందుకొస్తున్నారు. జొన్నవాడ సెంటర్ సమీపంలోని కామాక్షికట్ట ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల ఓ వ్యక్తి గుండెపోటుతో ఆదివారం మృతి చెందగా బంధువులెవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు.
నగర కమిషనర్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పీపీఈ కిట్లు ధరించి సంప్రదాయం ప్రకారం ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.