గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి కి “సేవారత్న ” పురస్కారాన్ని అందజేశారు.
హైదరాబాద్ లో చిక్కడపల్లి లోని త్యాగ రాయ గాన సభలో పినాకిని యూత్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 24 మందిని ఎన్నుకోగా అందులో పూసపాటి బాలాజి కి “సేవారత్న ” పురస్కారాన్ని అందజేశారు.
కరోనా సెకండ్ వేవ్ లో 50 రోజుల పాటు ప్రతి రోజు 150 మంది యాచకులకు, పేదలకు, నిరాశ్రయులకు అన్నం ప్యాకెట్లు అందజేయడం, మాస్క్ లు శానిటైజర్లు అందజేయడం లాంటి కార్యక్రమాలను ఆయన నిర్వహించారు.
మొదటి వేవ్ లో కూడా 2 నెలల పాటు ఆహార పొట్లాలు అందజేయడం, 2000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది.
ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందును ఆయను తగిన గుర్తింపు లభించింది. ఇప్పటి కి బాలాజి కి 75 జాతీయ అంతరజాతీయ పురస్కారాలు లభించాయి.
ఈ పురస్కారాన్ని అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ కె. సీతారామారావు, మల్కాజ్ గిరి కోర్టు జడ్జి బూర్గుల మధుసుధనరావు, త్యాగ రాయ గాన సభా అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, ప్రముఖ సినీ దర్శకులు చంద్ర మహేష్ అందచేశారు.