38.2 C
Hyderabad
April 25, 2024 13: 44 PM
Slider రంగారెడ్డి

షాద్ నగర్ లో సేవాలాల్ మహరాజ్ జయంతి కమిటీ ఏర్పాటు

shadnagar 19

సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని షాద్ నగర్ పట్టణ కేంద్రంలో నేడు జరిగిన గిరిజన నాయకులు సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి మిట్టునాయక్, రాంబాల్ నాయక్, రామావత్ రాజు నాయక్ అధ్యక్షత వహించారు.

ఈ నెల 24న షాద్ నగర్ పట్టణం లోని టీచర్ కాలనీ లో కొలువైన జగదంబ మాతా, సేవాలాల్ ఆలయం వద్ద వేడుకలు నిర్వహించడానికి ఉత్సవ నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. సేవాలాల్ మహరాజ్ నియోజకవర్గ స్థాయి ఉత్సవ కమిటీ అధ్యక్షుడుగా లక్ష్మణ్ నాయక్ (తెరాస మండల అధ్యక్షులు), ఉపాధ్యక్షులు – రామావత్ రాజు నాయక్ (MPTC – మేకగూడా) నందిగామ మండల అధ్యక్షులు – జే.రాజు నాయక్ (సర్పంచ్), కొత్తూరు మండల అధ్యక్షులు – లక్ష్మణ్ నాయక్ (EX:MPTC), సంతోష్ (సర్పంచ్),

ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు – శ్రీను నాయక్, బీ. రాజు నాయక్(MPTC), కేశంపేట్ మండల అధ్యక్షులు – జే. రాజు నాయక్(LHPS), రుప్లానాయక్, చౌదరిగూడా మండల అధ్యక్షులు – మోతీలాల్ నాయక్, రమేష్ నాయక్,  కొందుర్గ్ మండల అధ్యక్షులు – గోపాల్, లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు. షాద్ నగర్ టౌన్ లోకల్ కమిటీ కి సబవట్ గోపాల్ నాయక్ (సోలిపుర్), గణేష్ నాయక్, రమేశ్ నాయక్, పవన్ నాయక్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, LHPS, GVS, లంబాడీ సేన, వివిధ విద్యార్ధి సంఘాలు,పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

క్రైమ్: అనుమానాస్పద పరిస్థితుల్లో ఇద్దరు మృతి

Satyam NEWS

సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున మృతి

Satyam NEWS

క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే మేడా పై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

Leave a Comment