28.7 C
Hyderabad
April 24, 2024 04: 31 AM
Slider జాతీయం

అదుపు తప్పిన ట్రక్కు: ఏడుగురు చిన్నారుల మృతి

#accident

బీహార్‌లోని వైశాలి జిల్లా మహానార్‌లో ఆదివారం రాత్రి అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న నివాసంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు చిన్నారులు చనిపోయారు. కాగా చాలా మందికి గాయాలు అయ్యాయి. మహనార్ హాజీపూర్ ప్రధాన రహదారిపై దేశ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాగావ్ టోలా సమీపంలో ట్రక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నివాసంలోకి ప్రవేశించింది. ఇక్కడ పూజలు చేస్తున్న దాదాపు డజను మందిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. అదే సమయంలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఘటనాస్థలికి భారీగా జనం గుమిగూడారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

Related posts

మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

ఏపిలో మ‌రో 13 మంది ఐపీఎస్ లు బ‌దిలీ…!

Satyam NEWS

హోలీ డిప్:వారణాసిలో మౌనిఅమావాస్య పుణ్యస్నానాలు

Satyam NEWS

Leave a Comment