టీ.ఆర్.ఎస్ కండువా ఒక గొడ్డలి లాంటిది.. దాన్ని మెడపై వేసుకుంటే అంతే సంగతులు అన్నారు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ధర్మపురి సంజయ్ తోబాటు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్, భూపాలపల్లి జిల్లా సీనియర్ లీడర్ గండ్ర సత్యనారాయణ నేడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. టీ.ఆర్.ఎస్ రాజకీయ పార్టీ కాదని అది ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలాంటిదని ధర్మపురి సంజయ్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎర్ర శేఖర్ ప్రకటించారు.