తెలంగాణ రాష్ట్ర సమితి హుజరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. నేడు హుజరాబాద్ మండలం రంగాపూర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 200 మంది యువకులు సింగపూర్ గెస్ట్ హౌస్ లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన యువతకు మంత్రి కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి చాలా మంది యువత పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత, మహిళలు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అయిపోయిందని మెజారిటీ కోసమే పోరాటమని మంత్రి పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి యువతను మోసం చేస్తుందని, రానున్న ఎన్నికల్లో బిజెపికి యువత తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో సంజయ్ అశోక్ హరీష్ రాజు విజయ్ శ్రీనివాస్ హరికృష్ణ లతోపాటు 200 మంది యువకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.