37.2 C
Hyderabad
March 28, 2024 18: 30 PM
Slider రంగారెడ్డి

భారీ నిధులతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం హర్షణీయం

#charlapally

దేశంలో ఎక్కడా లేని విధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం హర్షనీయమని టిఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్ లు పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం అభివృద్ధి పనుల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు కృషిచేసిన పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిత్రపటానికి శుక్రవారం చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద పాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా డప్పు గిరిబాబు సారా అనిల్ లు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి ఫలాలు సాధించేందుకు అవసరమైన నిధులను కేటాయించడం శుభ పరిణామం అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ నాయకులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, కడియాల బాబు, కర్రే సత్యనారాయణ, రెడ్డి నాయక్, నరసింహ గౌడ్, వంశీ, జౌండ్ల వేణుగోపాల్ రెడ్డి, కరీం, సర్పరాజ్, ప్రహ్లాద్ రెడ్డి, నాలుగు కాళ్ళ వెంకటేష్, గోడల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేడారం మహా జాతర తేదీల ఖరారు

Satyam NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఏకగ్రీవ తీర్మానం

Satyam NEWS

కొత్త నోట్లు కట్టలు కట్టలు దొరుకుతున్నాయి

Satyam NEWS

Leave a Comment