నలుగురు యువకులు ఒక 25 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాంలో జరిగింది.
డిఎల్ఎఫ్ ఫేజ్ 2లో జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందగానే తక్షణమే స్పందించి అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను అరెస్టు చేశారు.
25 ఏళ్ల ఆ అమ్మాయిని పవన్ అనే యువకుడు సికందర్ పూర్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ సెక్స్ కోసం మాట్లాడుకున్నాడు. తాము ఇద్దరం ఉన్నట్లు చెప్పడంతో ఆ అమ్మాయి అంగీకరించింది.
అయితే డిఎల్ఎఫ్ ఫేజ్ 2 వద్దకు వెళ్లిన తర్వాత అక్కడ నలుగురు వ్యక్తులు ఉండటంతో ఆ అమ్మాయి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే నలుగురు ఆమెను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమెపై దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. దాంతో అఘాయిత్యానికి పాల్పడిన పవన్, రంజన్, గోబింద్, పంకజ్ లను పోలీసులు అరెస్టు చేశారు.