వెంటిలేటర్పై ఉన్న గర్భిణికి కేజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.
కేజీహెచ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో ఉన్న 30 ఏళ్ల గర్భిణికి గైనకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది.
సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. వెంటిలేటర్పై ఉన్న గర్భిణికి శస్త్రచికిత్స చేయడం కేజీహెచ్ చరిత్రలో తొలిసారి అని డాక్టర్ కవిత తెలిపారు.
అనంతరం శిశువుకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు చెప్పారు.
ప్రస్తుతం తల్లి ఆరోగ్యం కూడా మెరుగు పడిందని.. ఆమె ఆక్సిజన్ స్థాయులు పెరిగాయని వైద్యులు తెలిపారు.