36.2 C
Hyderabad
April 25, 2024 20: 07 PM
Slider హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేయాలి

#sfi

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఉప్పల్‌ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శిలు ఖాసీంజాలం, అఖిలలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్‌లకోసం వేలకోట్లు ఖర్చు చేస్తోంది కాని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే పేద విద్యార్ధులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఉందని వారు విమర్శించారు.

పాఠశాలలోని ప్రధానోపాద్యాయులకు మీరే స్పాన్సర్లను వెతికి  పిల్లలకు మాస్కులు ,శానిటైజర్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వపాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్ధులకు మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేయాలని  వారు డిమాండ్‌ చేశారు. అలాగే విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సమయంలో తగిన పౌష్టికాహారం అందించాలని వారు కోరారు.

Related posts

రామాంతపూర్ లో వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Satyam NEWS

విలేజ్ డెవలప్ మెంట్: రాజుల గ్రామాన్ని సందర్శించిన ఎంపీవో

Satyam NEWS

ప్రతి చట్టం పై పిల్లలకు అవగాహన అవసరం

Satyam NEWS

Leave a Comment