సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 74వ, జన్మదినోత్సవ వేడుకలను ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తల్లి సోనియాగాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.
16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని అప్పజెప్పిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని అన్నారు. నూట ఇరవై ఐదు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా వ్యవహరించిన వ్యక్తిగా సోనియా గాంధీ చరిత్ర సృష్టించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆరవ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి,INTUC పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు యాదవ్,INTUC మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, ఐ ఎన్ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి పోతనబోయిన రామ్మూర్తి,
ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, కాల్వ పెద్ద వెంకటేశ్వరరావు, రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ నాయకులు కస్తాల రవీందర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.