రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు.
ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్ కలిసి షాబాద్ మండల, సోలిపేట గ్రామానికి చెందిన విజయ మోహన్ రెడ్డి భూమి విషయంలో వివాదం రాగా దాని సెటిల్ మెంట్ కు లంచం డిమాండ్ చేశారు. దాంతో అవినీతి నిరోధక శాఖ దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది.
ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కూడా పనిచేశారు. ఇక్కడ పని చేసినప్పుడు కూడా ఆయనపై భూ అక్రమాల నేపథ్యంలో ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. తాజాగా శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.