35.2 C
Hyderabad
May 29, 2023 20: 41 PM
Slider జాతీయం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షబ్బీర్ భేటీ

sagar

మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఇద్దరు నేతలను షబ్బీర్ అలీ అభినందించారు.

అనంతరం తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షుడితో సవివరంగా చర్చించారు. తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో తెలుగు, మైనారిటీ ఓటర్లు కీలక పాత్ర పోషించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు మాట్లాడేవారు, మైనారిటీలు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ పార్టీపై తమకున్న విశ్వాసం వ్యక్తం చేసినట్లయిందని అన్నారు. కర్నాటక విజయం తెలంగాణలో ప్రతిధ్వనిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

పోలింగ్ బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్తలతో సహా తెలంగాణ అంతటా పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి దయాసాగర్ కూడా పాల్గొన్నారు.

Related posts

అన్నదాతకు అండగా టీఆర్ఎస్‌ ప్రభుత్వం

Sub Editor

తెలంగాణా సాధించింది బిజెపి నేత సుష్మా స్వరాజ్

Satyam NEWS

సాంకేతిక మండలుల తొలి సమావేశం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!