సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం మార్కెట్ యార్డు,ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో మంత్రి కెటిఆర్ జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సైదిరెడ్డి మొక్కలు నాటి, మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.