40.2 C
Hyderabad
April 19, 2024 16: 40 PM
Slider ముఖ్యంశాలు

‘‘స్థానికత’’పై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు

#YSSharmila

విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా? అని వై ఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో బుధవారం వైఎస్‌ షర్మిల సమావేశం అయ్యారు.

లోటస్ పాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తీరు తదితర అంశాలపైన విద్యార్థుల అభిప్రాయాలను ఆమె స్వీకరించారు.

ఈ సందర్భంగా విద్యార్ధులు పలు ప్రశ్నలు వేయగా వాటికి షర్మిల సమాధానం చెప్పారు. తాను స్థానికురాలిని కాదు అన్న ఆరోపణలకు విజయశాంతి, కేసీఆర్ ల స్థానికతపై ఆమె ప్రశ్నలు సంధించారు.

తమిళనాడులో జయలలిత కూడా స్థానికురాలు కాదని ఆమె అన్నారు. తెలంగాణకు ఏం చేశామన్నది ముఖ్యమని ఆమె అన్నారు.

తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షర్మిల అన్నారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని ఆమె అన్నారు. తన తల్లి మద్దతు తనకు ఉందని షర్మిల అన్నారు.

తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలని షర్మిల అన్నారు.

Related posts

కన్ఫర్మడ్: పౌరసత్వ చట్టానికి సిఎం జగన్ వ్యతిరేకం

Satyam NEWS

అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

వైస్ ప్రిన్సిపాల్ కోలుకోవాలని హనుమాన్ టెంపుల్ లో పూజలు

Bhavani

Leave a Comment