37.2 C
Hyderabad
March 28, 2024 19: 11 PM
Slider ముఖ్యంశాలు

తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రముఖ కార్మికనాయకుడు శీతల రోషపతి

#tntuc

టి.ఎన్.టి.యు.సి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శీతల రోషపతి నియామకం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాదు నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సిఐటియు మాజీ రాష్ట్ర నాయకుడు శీతల రోశపతి,రైస్ మిల్లర్స్ వర్కర్స్ దినసరి కూలీల నియోజకవర్గ అధ్యక్షురాలు సాముల కోటమ్మ,గోపి లు తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరికి తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన శీతల రోషపతి ని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శీతల రోషపతి ని తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం రాష్ట్ర కార్మిక విభాగానికి (టి.ఎన్.టి.యు.సి) ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బుధవారం నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. తన నియామకం పట్ల శీతల రోషపతి హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,నల్లగొండ పార్లమెంటు అధ్యక్షుడు,రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గ ప్రసాద్,రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన,హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకులు మండవ వెంకటేశ్వర్లు గౌడ్, మఠంపల్లి మండల అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ

Bhavani

విజయనగరం జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

ఏప్రిల్ 22 నుండి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment