40.2 C
Hyderabad
April 24, 2024 15: 07 PM
Slider మెదక్

దుంపలపల్లి లో గొర్రెల కాపరి దారుణ హత్య

#murder case

సిద్దిపేట జిల్లా దుబ్బాక  మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బలపల్లి లో దారుణం చోటుచేసుకుంది. దుంపలపల్లి గ్రామానికి చెందిన  దొందడి రెడ్డయ్య అనే గొర్లకాపరిని బుధవారం రాత్రి  గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

రోజు మాదిరిగానే రెడ్డయ్య బుధవారం తన చెందిన జీవాలకు మేత కోసం తీసుకువెళ్లి బుధవారం రాత్రి  ఇంటికి రాలేదు. గురువారం ఉదయం శవమై కనిపించడంతో దుబ్బాక పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్బంగా సిద్దిపేట ఏసీపీ మాట్లాడుతూ రెడ్డయ్యను ఎవరో హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. రెడ్డయ్య శవం వద్ద మూడు మద్యం సీసాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

మృతదేహాపై కాటులు శరీరంపై గాయాలు ఉన్నాయి. క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. త్వరలోనే హంతకులను  పట్టుకుంటామని   తెలిపారు.

Related posts

జగన్ ప్రభుత్వం సిగ్గు తీసేసిన మహిళ

Satyam NEWS

జగన్ చేస్తున్న తప్పుల వల్లే చంద్రబాబుకు బ్రహ్మరథం

Satyam NEWS

రష్యా సైన్యంలో చేరాలని యూనివర్సిటీ విద్యార్థులపై వత్తిడి

Satyam NEWS

Leave a Comment