మహారాష్ట్రలో రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు షిర్డీ సాయి బాబా ట్రస్టు రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా పై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమరానికి తన వంతు సాయం చేస్తున్నట్లు ట్రస్టు ప్రకటించింది.
దేశంలో కరోనా సోకిన సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా 724 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా మహారాష్ట్రలో 130 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 15 మంది కోలుకోగా ఇప్పటివరకు అక్కడ నాలుగురు మరణించారు.