మహా శివరాత్రి సందర్భంగా అత్తిరాల తిరునాళ్ళు వేడుకగా మొదలైనాయి. శివనామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారు మ్రోగాయి. భక్తులు వేలాదిగా తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాల లో శ్రీ త్రే త్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారంనాడు భక్తులు వేలాదిగా తరలించారు.
ఈ సందర్భంగా భక్తులకు వివిధ స్వచ్చంద సంస్థల వారు, సేవా సంఘాల వారు అన్నదానం నిర్వహించారు. మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి వారు,అమ్మ వారు విశేషంగా ఆకర్షిస్తూ పూజలందు కున్నారు.