శివరాత్రి సందర్భంగా కాలేరు పద్మావెంకటేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ గోల్నాక డివిజన్ నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్లో నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముడు రోజుల పాటు జరిగింది. ఈ ట్రోర్నమెంట్ లో అంబర్ పేట్ నియోజకవర్గం ప్రతి డివిజన్ నుండి మొత్తం 30 టీమ్ లు పాల్గొన్నారని గోల్నాక డివిజన్ వార్డ్ మెంబర్ దోర్నాల భరత్రాజ్ ముదిరాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేరు శ్రావన్, కాలేరు రాజు తదితరులు పాల్గొన్నారు.