పంజాబ్ లో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న నౌదీప్ కౌర్ తో పాటు సోనిపట్ పోలీసులు అరెస్టు చేసిన దళిత హక్కుల నేత, మజ్దూర్ అధికార్ సంఘటన్ అధ్యక్షుడు శివకుమార్ ను లాకప్ లో పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లు వైద్య బృందం నిర్ధారించింది.
నౌదీప్ కౌర్ కుండలి పారిశ్రామిక ప్రాంతంలో ఒక పరిశ్రమ యాజమాన్యంపై దాడి చేసి, లూటీ చేశారని, దాన్ని అడ్డుకోబోయిన పోలీసులపై తిరగబడ్డారని ఆరోపిస్తూ జనవరి 12న పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న నౌదీప్ కౌర్ ను అరెస్టు చేయడంపై అంతర్జాతీయంగా అలజడి చెలరేగింది.
అమెరికాలోని న్యాయవాది మీరా హారిస్ చేసిన వ్యాఖ్యలతో నౌదీప్ కౌర్ పై జరిగిన అన్యాయం ప్రపంచ దేశాలకు తెలిసింది.
సోనిపట్ పోలీసులు లాకప్ లో ఆమెపై అత్యాచారం చేశారని మీరా హారిస్ ఆరోపించారు. నౌదీప్ కౌర్ తో బాటు పోలీసులు అరెస్టు చేసిన శివకుమార్ ను పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై పంజాబ్ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యం బృందం పరీక్షలు నిర్వహించింది. శివకుమార్ శరీరంపై ఎనిమిది చోట్ల తీవ్రగాయాలు ఉన్నాయని వైద్య బృందం నిర్ధారించింది.