వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారించిన అనంతరం.. ఈ హత్య కేసులో ఛార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు. 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ తనకు వస్తున్న పెన్షన్ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్ ను దూషించింది. దీంతో మరియమ్మ ఇంటిపై దాడి చేసి అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మహిళను దారుణంగా హతమార్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
previous post