37.2 C
Hyderabad
April 19, 2024 14: 53 PM
Slider ప్రత్యేకం

షర్మిలకు పెద్ద షాక్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

#yssharmila

తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపిస్తూ షర్మిల హైదరాబాద్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు ఆమె ఖమ్మం జిల్లాలో భారీ సభ నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అత్యంత దారుణంగా విమర్శించిన విషయం తెలిసిందే.

తెలంగాణ లో సంక్షేమమే అమలు కావడం లేదని, అందువల్ల రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఉందని షర్మిల స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. అందుకోసం జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించారు.

త్వరలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నద్ధం అవుతున్న షర్మిల అకస్మాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు టీఆర్ఎస్ పార్టీని అభినందిస్తున్నానని ఆమె తెలిపారు.

కరోనా రెండో వేవ్ ను కూడా కేసీఆర్ లెక్కచేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు. “కరోనా ను సైతం లెక్క చేయకుండా నాగార్జునసాగర్ లో ఎన్నికలు జరిపించి విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు.

ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని కోరుతున్నాం” అని షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

సడన్ గా కేసీఆర్ ను పొగడటానికి ఒక పెద్ద కారణం ఉంది. ఇంత కాలం ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించారు.

దాంతో ఆమెకు ఒక్క సారిగా షాక్ తగిలి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అదీ సంగతి.

Related posts

బ్రిటన్ నూతన చక్రవర్తిగా కింగ్ చార్లెస్ III

Satyam NEWS

హాట్ టాపిక్ గా బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని

Satyam NEWS

డైలీ వన్ :మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం

Satyam NEWS

Leave a Comment