38.2 C
Hyderabad
April 25, 2024 14: 45 PM
Slider ఆదిలాబాద్

ఎలక్ట్రిక్ టూవీలర్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి ఐకె రెడ్డి

#Minister I K Reddy

నిర్మల్ పట్టణం శాంతి నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీజ ఎలెక్ట్రిక్ టూ వీలర్ షో రూమ్ ను శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణం నాశనం కాకుండా ఉంటుందని చెప్పారు. కేవలం నాలుగు గంటల చార్జింగ్ తో రెండు వందల కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. ఎలాంటి ఇందన ఖర్చు ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి పర్యావరణం కాపాడాలని ఆయన కోరారు.

అనంతరం మంత్రి వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపి రామేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము ,కౌన్సిలర్లు రామగౌని తులసి, సబితా శ్రీధర్, లక్కకుల నరహరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ కు సన్మానం

Satyam NEWS

సెంట్రల్ వెస్టా ప్రాజెక్టు అంటే ఏమిటి? వివరాలు ఇవిగో

Satyam NEWS

పోస్టాఫీసు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

Leave a Comment