నిర్మల్ పట్టణం శాంతి నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీజ ఎలెక్ట్రిక్ టూ వీలర్ షో రూమ్ ను శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణం నాశనం కాకుండా ఉంటుందని చెప్పారు. కేవలం నాలుగు గంటల చార్జింగ్ తో రెండు వందల కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. ఎలాంటి ఇందన ఖర్చు ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి పర్యావరణం కాపాడాలని ఆయన కోరారు.
అనంతరం మంత్రి వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపి రామేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము ,కౌన్సిలర్లు రామగౌని తులసి, సబితా శ్రీధర్, లక్కకుల నరహరి తదితరులు పాల్గొన్నారు.