రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసి రెడ్డి, యువజన కాంగ్రెస్ నేత విష్ణు ప్రీతం రెడ్డి పాల్గొన్నారు.
కడప నగరంలోని పాత బస్టాండ్ కూడలిలో యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.