మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లన్న కు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నుండి ఈవో వెంకటేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానంతరం వారికి అమ్మవారి ఆశీర్వచన మండపం లో శ్రీశైల దేవస్థానం అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన నేడు స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు.
లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిగాయి. సాయంకాలం మయూర వాహనసేవ ఉంటుంది.
సాయంత్రం 6.00 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ జరుగుతుంది.
ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది.