39.2 C
Hyderabad
March 29, 2024 16: 01 PM
Slider విశాఖపట్నం

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

#SimhachalamTemple

సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో బద్రపరిచిన 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు గుర్తించిన దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న స్థానిక గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో ఇంటి దొంగలే దొంగతనానికి  పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు గతంలో దేవాలయంలో పనిచేసిన మాజీ  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్‌లను అనుమానించి విచారించగా విషయం బయటపడింది.

ఆలయంలో పనిచేసే మరికొంత మంది తో కలసి ఆలయ వ్యర్థాల్లో కలిపి ఇత్తడి కానుకలను బయటకు తరలించినట్టు అంగీకరించారు. కానుకలను విక్రయించిన, కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Related posts

మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

Bhavani

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

కడపనే అభివృద్ధి చేయలేని సీఎం జగన్

Bhavani

Leave a Comment