28.7 C
Hyderabad
April 20, 2024 06: 40 AM
Slider విజయనగరం

హెంగార్డు నిజాయితీ…20వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ అప్పగింత…!

#VijayanagaramPolice

మరికొద్ది రోజుల్లో… పదోన్నతి రానున్న విజయనగరం జిల్లా ఎస్పీ శాఖా పరంగా చూపెడుతున్న తీరు.. సిబ్బంది లో నిజాయితీ ని బయటపెడుతోందని..మరో సారి రుజువు అయ్యింది.

గతంలో ఓ సీఐ ,ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ ,తాజాగా ఓ హోంగార్డు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా పోలీసు శాఖలో హెూంగార్డుగా పనిచేస్తున్న ఆర్. గణపతికి సుమారు 20 వేలు ఖరీదు చేసే సెల్ ఫోన్ లభ్యమైంది.

తనకు సెల్ ఫోన్ దొరికిన విషయాన్ని విజయనగరం టూటౌన్ సీఐ సి. హెచ్. శ్రీనివాసరావుకు తెలియజేయగా. తక్షణం సీఐ సెల్ ఫోన్ లో గల ఫోన్ నెంబర్లు ఆధారంగా, సెల్ గల వ్యక్తి విశాఖ జిల్లా, ఆనందపురం మండలం, రేగానిగూడెంకు చెందిన కోట్ల నాగమణికి చెందినదిగా గుర్తించారు.

సీఐ సూచనల మేరకు సెల్ పోగొట్టుకున్న బాధితురాలు కోట్ల నాగమణి విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషనుకు రాగా, సీఐ సీ. హెచ్.శ్రీనివాసరావు సమక్షంలో, హోంగార్డు ఆర్. గణపతిరావు చేతుల మీదుగా బాధితురాలు కోట్ల నాగమణికి సెల్ ఫోన్ ను అప్పగించారు.

బాధితురాలు నాగమణి పోగొట్టుకొన్న తన కొత్త సెల్ ఫోన్ ను గంట వ్యవధిలో తిరిగి తనకు అప్పగించిన హోంగార్డు గణపతిరావు, సీఐ శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. గణపతిరావు నిజాయితీని టూటౌన్ సీఐ శ్రీనివాసరావు,  పోలీసు అధికారులు అభినందించారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

సమాధులు తొలగించినందుకు అందరూ క్షమించండి

Satyam NEWS

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన ఐ ఏ ఎస్,ఐ ఆర్ ఎస్ బృందం

Satyam NEWS

మూడేళ్ల వయసుకే ఓటు హక్కు ఇచ్చేశారు

Satyam NEWS

Leave a Comment