28.2 C
Hyderabad
April 30, 2025 05: 41 AM
Slider ఆదిలాబాద్

ఇంకా ఈ సమాజంలో నిజాయితీ బతికే ఉంది

fruit vendor

పదిహేను రోజుల కిందట మంచిర్యాల బస్టాండ్ వద్ద మందమర్రి కి చెందిన  శంకరమ్మ అనే మహిళ అనారోగ్యంతో కళ్లుతిరిగి పడిపోయింది. అక్కడి వారు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే అక్కడ ఆమె సంచిని అందరూ వదిలేశారు. బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తున్న ఎండి.ఖంరొద్దిన్ శంకరమ్మ మరచిపోయిన సంచిని గమనించి తన వద్ద భద్ర పరిచాడు. శంకరమ్మ వస్తే ఇద్దామని అనుకున్నాడు.

ఆరోగ్యం మెరుగుపడి వచ్చిన శంకరమ్మ మళ్లీ స్థానిక బస్టాండ్ వద్ద కనపడటంతో వెంటనే పిలిచి నీ చేతి సంచి మరచిపోయావు అది నావద్ద ఉన్నది అని చెప్పడంతో శంకరమ్మ సంబరపడి పోయింది. ఆ చేతి సంచిలో సుమారు 2000 వేల రూపాయలు, ఆధార్ కార్డు తదితర వస్తువులు ఉన్నాయి. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ మారుతి  సమక్షంలో శంకరమ్మ చేతి సంచి, అందులోని డబ్బును అందజేశారు. నిజాయితీ చాటుకున్న పండ్ల వ్యాపారి ఖంరోద్ధిన్ ను ఎస్ ఐ అభినందించారు.

Related posts

కరోనా నిరోధానికి శ్రీ చైతన్య రూ.కోటి విరాళం

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

గోదావరిలో మునిగిపోయిన ఏపి పర్యాటక రంగం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!