28.7 C
Hyderabad
April 25, 2024 04: 46 AM
Slider ప్రపంచం

భారత్‌ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత

కోవిడ్‌–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్‌ సడలిస్తోంది. తాజాగా, భారత్‌ సహా ఐదు దక్షిణాసియా దేశాలను ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్‌ ఆరోగ్య శాఖ పేర్కొంది.

అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆంక్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది.

Related posts

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఓ మహిళను ఆదుకున్న చిత్తూరు పోలీసులు

Bhavani

డోంట్ ప్యానిక్ :వామ్మో టివి నుండి దెయ్యం బయటకు వచ్చింది

Satyam NEWS

Leave a Comment