కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. జిల్లాలోని రామగుండం రీజీయన్లో ఆరు భూగర్భగనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు విధులకు హజరుకాలేదు. సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మరోవైపు సమ్మెకు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, బీఎంఎస్ దూరంగా ఉంది.