37.2 C
Hyderabad
March 29, 2024 19: 06 PM
Slider తెలంగాణ

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ పంపిణీ

singareni

సింగరేణి కార్మికులకు దీపాబళి బోనస్ ను నేడు అందచేస్తున్నట్లు సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ తెలిపారు. అధికారులు మినహా మిగిలిన కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి 64,700 రూపాయల బోనస్ అందబోతున్నది. ఈ బోనస్ ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు జమ చేశారు. దీపావళి బొనస్ గా పిలిచే ఈ పి.ఎల్.ఆర్. స్కీం ( పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం) కోసం 258 కోట్ల రూపాయలను యాజమాన్యం విడుదల చేసింది. ఇటీవలనే 494 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను పంపిణీ చేశారు. దీంతో సగటున లక్ష రూపాయలకు పైగా లాభాల బోనస్ ను కార్మికులు అందుకున్నట్లు అయింది. బోనస్ పైసలలో కొంత మొత్తం ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని యాజమాన్యం కార్మికులకు సూచించింది. కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

మంత్రుల సమావేశంలో కరెంటు హాంఫట్

Satyam NEWS

అత్యంత మారుమూల ప్రాంతానికి పోలీసుల చొరవతో రోడ్డు

Satyam NEWS

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తక్షణమే నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment