నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కార్యక్రమంలో కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులకు కోరికలు తీరుస్తున్న శ్రీ లక్ష్మి నరసింహుడు ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన స్వామి. ప్రతి ఏటా సంక్రాంతి అనంతరం రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సింగోటంలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుకొని భక్తులు తరించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ పాడిపంటలతో, అయురారోగ్యలతో కలసిమెలసి సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు రంగినేని అభిలాష్ రావు తెలిపారు.
previous post