సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా చారిత్రాత్మక శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ వర్గ ప్రాంతంలోని సింగోటం గ్రామంలో ఉన్న ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో ఒకటి. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం గ్రహణ అనంతరమే సాధ్యమౌతుంది. గురువారం సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయం మూసివేశారు. ప్రతి సారీ సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో ఈ ఆలయాన్ని మూసివేయడం సాంప్రదాయం. ఇదే సాంప్రదాయం ప్రకారం నేడు ఆలయాన్ని మూసివేశారు. గ్రహం విడిచిన తర్వాత దేవాలయాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
previous post