ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను సంబర జాతర ప్రారంభమైంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు మూడులాంతర్ల వద్ద అమ్మ వారి దేవాలయం వద్దకు సిరిమాను ను తీసుకు వచ్చారు… నిర్వాహకులు. అంతకుముందే సాకేటి వీధి నుంచీ కర్రల దండు వచ్చింది.
సరిగ్గా ఈ సాయంత్రం మూడు నుంచీ 5 గంటల మధ్య దేవాలయం నుంచీ కోటవరకు సిరిమాను రధం తిరుగుతుంది.ముఃదుగా సిరిమానను పై అమ్మ వారి రూపంలో ఉన్న పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు కూర్చుంటారు.ఇందుకోసం సిరిమాను ను సిధ్ధం చేస్తున్నారు. ఇక ఏన్నో ఏళ్ల నుంచీ ఆచారంగా వస్తున్న వర్షం పడింది కూడా. ఇక సిరిమాను తిరగడమే తరువాయి.