ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణ హాజరుకావాలని 41ఎ సీఆర్పీసీ కింద నోటిసులు అందించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలకు రూ.100 కోట్లు సమకూరుస్తానని రఘురామకృష్ణంరాజు చెప్పినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయనను విచరిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.