ఉత్తరాంధ్ర లో అదీ విజయనగరం జిల్లాలో టీడీపీ కి ఉన్న పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ‘రాజుగారి’కోటలో వేరు కుంపటి రూపేణ…మాజీ ఎమ్మెల్యే మీసాలగీత కొత్తగా అశోక్ బంగ్లాను కాదని ప్రత్యేకం కొత్తగా జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించినసంగతి తెలిసిందే.
జిల్లా పరిస్థితి పై రాష్ట్ర పార్టీ ఆరా తీసింది కూడ.అయితే అనుకోకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు ను మాజీ ఎమ్మెల్యే మీసాలగీత కలవడం యాధృచ్చికమైన..జిల్లా పార్టీ పరిస్థితి గురించి తెలియచెప్పారు…మాజీ ఎమ్మెల్యే గీత.
దీనిపై కొత్తగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో మీసాల గీత మీడియా తో మాట్లాడారు.జిల్లా పార్టీ పరిస్థితి.. వేరు ‘కుంపటి’ అంశాన్ని రాష్ట్ర పార్టీ కేడర్ కు తెలియచెబుతానని పార్టీ అధ్యక్షుడు తెలిపారన్నారు. ఇక జిల్లా పార్టీ పరిస్థితి దయనీయ స్థితి గురించి చాలా మంది తీవ్రంగా బాధపడుతున్నారని గీత తెలిపారు.
బంగ్లాని కాకుండా… వేరే చోట కార్యాలయం ప్రారంభించడంతో జిల్లా పా్టీ కేడర్ లో ఎంతో ఉత్సాహం వచ్చిందని ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుకి చెప్పానని మాజీ ఎమ్మెల్యే గీత తెలిపారు.
ఇక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లి పన్నుల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలి మాజీ ఎమ్మెల్యే గీత అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఎన్ఎం రాజు కూడా ఉన్నారు.