వర్షాలు తగ్గిన వెంటనే శివ సాయి నగర్ ఫేస్ 3 కల్వర్టు నిర్మాణం పనులు మొదలు పెట్టి సాధ్యమైనంత తొందరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శివ సాయి నగర్ ఫేస్ 3 వాసులు ఇబ్బందులు పడుతున్నారని సాధ్యమైనంత తొందరలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరుతూ మంగళవారం హబ్సిగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు కలుసుకుని వినతి పత్రం సమర్పించడం జరిగింది.
దీంతో ఆయన పై విధంగా స్పందించి వర్షాలు తగ్గగానే నవంబర్ నెలలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టి పూర్తి చేస్తామన్నారు.